విజయనగరం జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్ది హాస్పటల్ పాలయ్యాడు. జిల్లాలోని కొప్పెర్ల లో ఉన్న బాలయోగి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జియ్యమ్మవలసకు చెందిన ఓ బిడ్డ..చదువుతున్నాడు.
గత రాత్రి భోజన సమయంలో ప్లేట్ కడిగే సమయంలో అక్కడే చిన్న పనిముట్టు కాలికి తగలడంతో పక్కనే మరుగుతున్న నీటిలో పడిపోయాడు. హాఠాత్తుగా జరిగిన పరిణామంతో ఒక్క సారి షాక్ తిన్న హాస్టల్ వార్డన్ హుటాహుటిన బాలుడిని భోగాపురం హాస్పటల్ కు అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు.
అక్కడ నుంచీ మెరుగైన చికిత్స కోసం..విజయనగరంలోని ప్రభుత్వ హాస్పటల కు మెరుగైన చిక్సతకై తరలించారు. వెను వెంటనే హాస్పటల్ వైద్యులు ఎమర్జన్సీ వార్డులో తగిన చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పాఠశాల కో ఆర్డినేటర్..హుటాహుటిన హస్పటల్ కు వచ్చి బాలుడ్ని చూసి…కన్నవారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్బంగా కో ఆర్డినేటర్ మీడియాతో మాట్లాడుతూ…గత రాత్రి ఈ ఘటన జరిగిందని…హుటాహుటిన తామంతా స్పందించామన్నారు. బాలుడు కన్నతల్లి మాట్లాడుతూ….మా బాబు తప్పేమీ లేదంటూ కంట తడి పెట్టారు.