తమ అధినేత పై జరుగుతున్న అన్యాయం పై ప్రజాస్వామ్య పరంగా నిరసన తెలియజెప్పే హక్కే లేదా అని విజయనగరం జిల్లా జనసేన అధినేత గురాన అయ్యలు ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసుల తీరు బాగోలేదని అయ్యలు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్.. నిజంగా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యేనని అయ్యలు అన్నారు.
ప్రజాస్వామ్యం లో నిరసనలు కూడా తెలియజెప్పకుండా..ఈ నియంత ప్రభుత్వం… వ్యవహరిస్తోందని అన్నారు. నిన్నటికి ని న్న…విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు… అసలు బాగోలదని అన్నారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు ఉంటున్నారని గురాన అయ్యలు ధ్వజమెత్తారు.