39.2 C
Hyderabad
May 3, 2024 13: 15 PM
Slider కడప

ఐపీసీ సెక్షన్ కాకుండా, వైసీపీ సెక్షన్ ఉపయోగించి చితకబాదారు….

#bhatyala

కడప జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు సోమ వారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2 లక్షలా 30 వేల మందికి పాదయాత్ర లో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.

ప్రశ్నించిన నిరుద్యోగులను ఐపీసీ సెక్షన్ కాకుండా, వైసీపీ సెక్షన్ ఉపయోగించి చితకబాదారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందిజాబ్ క్యాలెండర్ కాదు,జాబ్ లెస్ కాలెండర్ అది అనిఎద్దేవాచేశారు.నిరుద్యోగులను మోసం చేశారని,కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని మాట తప్పారన్నారు.

హెల్త్ డిపార్ట్మెంట్ లోని శానిటేషన్ చేసే వారికి యేడాది నుంచి జీతాలు ఇవ్వలేదని ,దేశంలోనే ఇలాంటి సంఘటన జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు భారతాల శ్రీధర్ యాదవ్,అద్దెపల్లె ప్రతాప్ రాజు,మందా శ్రీను, ఈడిమడకలకుమార్, సంజీవి,సుబ్రహ్మణ్యం నాయుడు,మందపల్లె శ్రీను తదితరులు పాల్గొన్నారు.కాగా మంగళవారం భత్యాల చెంగల రాయుడు జన్మదిన సందర్భంగా ముందస్తుగా కేక్ కట్ చేసి ,పూల మాల,శాలువతో సత్కరించారు.

Related posts

ఇస్రో నుంచి విద్యార్ధులు సృష్టించిన ‘ఆజాది శాట్’ ప్రయోగం

Satyam NEWS

ఆడుకుంటున్న బాలుడిపైకి వెళ్లిన కారు

Satyam NEWS

మరో పెద్ద సమస్యలో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు

Satyam NEWS

Leave a Comment