సరిగ్గా ఆరు రోజుల క్రితం సత్యం న్యూస్. నెట్ ఇచ్చిన..”ఆరుగురు ఆడపిల్లలు..ఓ అవిటి తండ్రి” న్యూస్ కు స్పందన వచ్చింది. మగ బిడ్డల కోసం అవిటి తండ్రి పడిన ఆరాటం ఫలితంగా వరుసగా ఆరుగురు ఆడపిల్లలకు జన్మ నిచ్చారు.
సరిగ్గా “ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ రాజకుమారీ పూర్తి సమాచారం తెలుసుకున్న ఆమె..తనలో ఉన్న మానవత్వాన్ని మరో సారి చూపించారు. ఆరుగురు ఆడపిల్లలను కన్న తండ్రి సింహాచలం అవిటితనాన్ని ఎస్పీ గుర్తించి వికలాంగ కోటాలో ఆయన ట్రై సైకిల్ ను దగ్గరుండీ బ్యారక్స్ లో ఓ కార్యక్రమం నిర్వహించి మరీ ఆ తండ్రి కి అందజేశారు.
జిల్లాలో “ఆపరేషన్ ముస్కాన్” లో భాగంగా రక్షించిన ఆరుగురు ఆడ పిల్లల తండ్రి, దివ్యాంగుడైన బల్ల సింహాచలం కు జిల్లా పోలీసుశాఖ అండగా నిలిచింది. ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, 25 కిలోల బియ్యం, బట్టలు, దుప్పట్లు, ఖర్చుల ఖర్చుతో5 వేలు నగదు, గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ట్రై సైకిల్ ను జిల్లా ఎస్పీ .రాజకుమారి దివ్యాంగుని కుటుంబానికి అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, పలువురు సీఐలు, గురుదేవా చారిటబుల్ అధ్యక్షులు రాపర్తి జగదీష్ బాబు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.