31.2 C
Hyderabad
May 2, 2024 23: 11 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

ఆర్టీసీ కార్మికులు, మీడియాపై పోలీసు జులూం

rtc police

విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు, ఆర్టీసీ అధికారులు అడ్డుకుంటున్నారు. విచిత్రమైన ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తప్పమరెక్కడా ఉండదు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో వద్ద కార్మికులు పెద్ద ఎత్తున డ్యూటీలో చేరేందుకు ముందుకు రాగా యాజమాన్యం వారిని తీసుకునేందుకు నిరాకరించింది. దాంతో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా RTC కార్మికులను బేషరతుగా ఉద్యోగాలకు తీసుకోవాలని హయత్ నగర్ 1&2 డిపోల వద్ద చేరిన కార్మికులు డిపోను  ముట్టడించడంతో 13 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఒక్కొక్కటిగా బస్సులు బయటకు వస్తున్నాయి. బర్కత్ పురా డిపో వద్ద పోలిసులు  ఓవర్ యాక్షన్ చేశారు. డిపోవద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు తరిమి కొట్టారు. ఈ తోపులాటలో క్రింద పడిపోయి ఒక కార్మికురాలు స్పృహ కోల్పోయింది. ఆర్టీసీ కార్మికురాలు పద్మావతి (కండక్టర్)  పోలీసుల దౌర్జన్యానికి స్పృహ కోల్పోయింది. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా పోలీసులు దౌర్జన్యం చేశారు. మీడియా పై ఎసిపి జులుం ప్రదర్శించారు. ఫొటోస్ వీడియోస్ తీయకుండా CTC ఎసిపి ప్రదీప్ కుమార్ అడ్డుకున్నారు.

Related posts

అరవింద బాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

Satyam NEWS

ములుగు లోని దేవుని గుట్ట ఆలయం అద్భుతం

Satyam NEWS

ఒపీనియన్: లాక్ డౌన్ సడలిస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Satyam NEWS

Leave a Comment