భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీస్ అమరుల కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు వెళ్లి పండ్లు అందజేశారు. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని వారికి భరోసా కల్పించారు. చుంచుపల్లిలో నివాసముంటున్న పోలీసు అమరవీరులైన కానిస్టేబుల్ చందన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పీ గ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమను సంప్రదించవచ్చని అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే ప్రస్తుతం సమాజంలో మనం ప్రశాంతంగా జీవిస్తున్నామని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి ఎస్సై శ్రీనివాస్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
previous post