నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొరటికల్ గ్రామంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కి స్థానిక మహిళలు దీపావళి పండుగ సందర్భంగా ఆయన నుదుట కుంకుమ దిద్ది హారతి పట్టి ఘన స్వాగతం పలికారు మరో వైపు డప్పు కళాకారుల డప్పుల దరువులు, బ్యాండ్ వాయిద్యాలు, యువత కేరింతల నడుమ విస్తృతంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ మునుగోడు లో టిఆర్ఎస్ గెలుగు ఖాయంగా వుందన్నారు. ఖమ్మం జిల్లా కు చెందిన పలువురు నాయకులు కూడా పువ్వాడ తో వున్నారు.
previous post