ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల మార్పులు కొల్లాపూర్ నుండే మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి యువ నాయకుడు రంగినేని అభిలాష్ రావు భారీ షాక్ ఇచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి.? వాటిని ఎంత వరకు అమలు చేసింది.? ఇప్పుడు ప్రజలకు పాలన ఎలా అందిస్తున్నారు.? ప్రస్తుతం ప్రజలు కోరుకునే నాయకుడు ఎవరు.? ఏ పార్టీనీ కోరుకున్నారు.? అనే అంశాలపై ప్రశ్నించుకొని, నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు కానీ హుటాహుటిన టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో రంగినేనీ అభిలాష్ రావు భేటీ అయ్యారు. త్వరలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చెరబోతున్నాట్లు సంకేతాలు పంపారు.
నియోజకవర్గంలో అంచనాలకు మించిన అభిలాష్ రాజకీయం
రంగినేని అభిలాష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో చేరుతున్నాట్లు సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులతో ముందుగానే మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుండి ముఖ్య నాయకుల వరకు అందరితో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిదుల నుండి ఆయనకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలిసింది. ఇది వరకు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్లిన ప్రజాప్రతినిధుల పైన ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతే కాకుండా సొంత నాయకుడిపై అసంతృప్తిగా వున్నవారే కాకుండా పార్టీ పై అసంతృప్తిగా ఉన్నవారు కూడా ఆయనతో టచ్ లో ఉన్నారనీ తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్యను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కొందరు అధికార పార్టీలో ఉండి చేసిన అభివృద్ధి నిధులు మంజూరు అయ్యాక వెళ్ళడానికి కొద్దిగా ఆలస్యం అయ్యేలా వుంది. ఇప్పటి వరకు భారీ ఎత్తున టిఆర్ఎస్ పార్టీకి చేతి ఇచ్చి హస్తం గూటికి వెళ్ళడానికి తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
అందుకే కుట్రలకు తెరలేపిన క్రిమినల్ మైండ్ నాయకుడు
ఇదే సమయంలో ఓ క్రిమినల్ మైండ్ నాయకుడు కుట్రలకు తెరలేపారు. ఏదో పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లే అ నాయకుడు కుట్రలు చేయిస్తున్నారు. అభిలాష్ రావు పైనే కాకుండా కొందరి నేతల వ్యక్తిగత విషయాల పై కూడా సొంత సామాజిక వర్గానికి చెందిన వారితో అసత్య ప్రచారాలు చేయిస్తుంటారు. ఇప్పటికే క్రిమినల్ మైండ్ తో అభిలాష్ పై నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాలలో ఆ సత్య ప్రచారాలు చేయిస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయనే కోణంలో రంగినేని అభిలాష్ రావు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజాస్వామ్యంపై, చట్టాల పై నమ్మకం ఉంది. అందుకే చట్టాల ద్వారానే వారు ముందుకు వెళుతున్నట్లు తెలిసింది. అసత్య ప్రచారాలు ఏ క్యాంపు అఫీస్ నుండి వచ్చాయో, అవసరం వచ్చినప్పుడు ఆధారాలతో బయటికి వస్తాయని రంగినేని అంటున్నారు.