విజయనగరం జిల్లా ఉపాధ్యాయ సమస్యలపై యుద్దానికి సమాయాత్తం అవుతోంది…ఆంద్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం. ఈ మేరకు ఏపీయూస్ జిల్లా అధ్యక్షుడు రామునాయుడు మీడియాకు చేపట్టదలచిన కార్యచరణను తెలియ చేసారు.
వచ్చే నెల ఫస్ట్ లోపు సీపీఎస్ ను రద్దు చేయడం,55 శాతం బెనిఫిట్ కొత్త వేతన సవరణ అమలు చేయాలని,పెండింగ్ లోఉన్న డీఏను తక్షణం విడుదల చేయాలని అదే విధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
కాని పక్షంలో నవంబర్ 1 వ తేదీన ఉపాధ్యాయులందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై ఆర్డీఓకు వినతి పత్రం అందచేస్తామని తెలిపారు. అప్పటికీ తమ డిమాండ్లు అమలు చేయని పక్షంలో అదే నెల 8 జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి….అదే నెల 18 న రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరగబోవు ధర్నాలో పాల్గొంటామని తెలియ చేసారు.