రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు పృథ్వీ సిగ్గుపడాలని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. అమరావతి రైతులపై ఎస్విబిసి టెలివిజన్ చైర్మన్, సినీనటుడు పృథ్వి దారుణమైన విమర్శలు చేశాడు. పృథ్వి విమర్శలకు పోసాని కృష్ణమురళి క్షమాపణలు అడిగారు. తెలియక బుద్దిలేకుండా మాట్లాడినవారి కోసం రైతులకు, ఆడపడుచులకు నేను క్షమాపణలు చెబుతున్నా అని ఆయన అన్నారు.
అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులా? అమరావతిలో ఉన్న కమ్మవాళ్లను అన్నావా? రైతులను అన్నావా? రైతులు చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం వైఎస్ జగన్ను అన్పాపులర్ చేయడానికి పృథ్వీ ఇలా మాట్లాడుతున్నాడని పోసాని తెలిపారు. నమ్మి భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా చేసిన నాయకుడు మాత్రమే మొనగాడు అని ఆయన వ్యాఖ్యానించారు.