అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి పై వ్యతిరేకంగా పట్టణంలో రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్లు బుధవారం చర్చనీయాంశంగా మారాయి. మా నమ్మకం నువ్వే జగనన్న కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పైన నమ్మకం లేదు అంటూ పోస్టర్లు ఈ ఉదయం ప్రధాన కూడలిలో దర్శన మిచ్చాయి. ఈ పాస్టర్ దిగువ బాగానా ఇట్లు మోసపోయిన వైసిపి నాయకులు, కార్య కర్తలు అంటూ పోస్టర్లు వేయడం కలకలం సృష్టిస్తోంది.
ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి అనుచరులు హుటాహుటిన ఈ పోస్టర్లను తొలగించారు. ఈ పోస్టర్లు ఎవరు వేశారు,స్వపక్షం లో విపక్షం పనా,లేక ప్రతి పక్షాల పనా అని ప్రస్తుతం ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఉన్న సి.సి. ఫుటేజీ ఆధారంగా పోస్టర్లు వేసిన వారిని గుర్తించారు. థియేటర్ లో పోస్టర్లు అంటించే మన్నూరు కు చెందిన పొలిచర్ల కుమార్ (25)ను పట్టణ పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు.