మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం తొలగించడం తో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
కుటుంబ పోషణ ఇబ్బంది కావడం తో నలుగురికి ఉపాధి కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లు గోర్లు బర్లు కాస్తున్న దుస్థితి ఈ రాష్ట్రం లో ఉందని ఆమె అన్నారు.
ఈ రోజు వెంకటా పూర్ మండల పర్యటన ముగించుకొని ములుగు వస్తున్న క్రమములో బండారు పల్లి రోడ్డు గుండ గోర్లు కాస్తు తారసపడ్డ జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మ కుమారస్వామి ని చూసి ఆమె ఆగి పలుకరించారు. ఆయన కుటుంబ పరిస్థితులను ఆరా తీసి ఎమ్మెల్యే సీతక్క తన సానుభూతిని వ్యక్తం చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్ లకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తా అని ఆయనకు దైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, శంకర్ మేస్త్రి, ఉప సర్పంచ్ సాదు రాజు తదితరులు పాల్గొన్నారు.