ఏలూరు జిల్లా పెదవేగి నుండి కూచింపూడి వెళ్లే ఆర్ అం డ్ బి ప్రధాన రహదారి కి ఇరువైపులా అంచులు ప్రమాద కరంగా మారాయి. ఎదురుగా స్పీడ్ గా వచ్చే వాహనానికి భయపడి మార్జిన్ దిగితే ప్రాణాల మీద ఆశ వదిలేయాల్సిందే.
రోడ్డు నిర్మించి నప్పటి నుండి కాంట్రాక్టర్ కార్టింగ్ ఎర్త్ సరిచేయకుండా వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నది. మన బిల్లు మనకొస్తే అంటే చాలు అని ఆ నాడు కాంట్రాక్టర్ చేతులు దులుపుకుని మార్జిన్ నిర్మాణం గాలికొదిలేశాడు. ఎదురుగా వచ్చే బారి వాహనాలను ట్రాక్టర్ లను, ఆటోలను తప్పించాలంటే ద్విచక్ర వాహనదారులు గుండెలు గుప్పెటతో పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తున్నది.
పెదవేగి నుండి కూచింపూడి వరకు రోడ్డు మార్జిన్ దిగి ఎక్కి తే ప్రాణాలతో బయట పడతాము. ఒకవేళ మార్జిన్ ఎక్కేటప్పుడు టైరు స్లిప్పయితే హాస్పిటల్ కో స్మశానానికో వెళ్లక తప్పదు. ఇటువంటి భయంకరమైన రహదారి దుస్థితి పై అధికారులు స్పందించి ఈ రహదారి మార్జి న్ ఎగుడు దిగుడు అంచుల కు మరమ్మత్తులు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని ద్విచక్ర వాహన దారులు కోరుతున్నారు.