వైయస్సార్ సిపి జెండా పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, పేద వారికి అండ గా నిలుస్తుందని వైఎస్ఆర్ సిపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి. కుమార్ యాదవ్ అన్నారు. వైఎస్ఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని విజయవాడ తాడేపల్లిలో జరుగుతున్న వైఎస్ఆర్ సిపి ప్లీనరీ వేడుకలకు ఏఎస్ రావునగర్ కు చెందిన పార్టీ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ తో పాటు పార్టీ నాయకులు బాబుల్ రెడ్డి, శ్రీనివాస్, సైదుల్లా ప్రేమ్ సాగర్, గురువారెడ్డి తదితరులు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన లక్ష్యంగా ఏర్పడిన వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానంతో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజన్న రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా