ఈ నెల 22 వ తేదీ నుంచీ అయిదు రోజుల పార్టీ జనసేన పార్టీ సీనియర్ నెల త పబ్లిక్ ఎఫైర్ కమిటీ నేత నాదెండ్ల మనోహర్ విజయనగరం జిల్లా లో పర్యటించనున్నారు. జిల్లా లోని గంట్యాడ మండలం తాటిపూడి వద్ద ఓ రిసార్ట్ లో నియోజకవర్గ వారీగా పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ… జిల్లాలో గుంకలాంలో జగనన్న లే అవుట్ల స్థితిగతులేంటో..స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చి చూసారన్నారు.
ఆ నేపథ్యంలో నే జిల్లా లో పార్టీ ని ప్రజల పక్షాన నిలబడేందుకు అక్కడే సమావేశాలు నిర్వహించాలని చెప్పారన్నారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు జిల్లా లో ఉన్న సమస్యలు తద్వారా పార్టీ పోరాటం… ప్రజలలో పార్టీ ని తీసుకెళ్లేందుకు అవకాశాల వంటి సమస్యలపై ఈ అయిదు రోజుల చర్చిస్తామని ఈ నెల 27 వ తేదీన అన్ని విషయాలను కూలంకషంగా మీతో పంచుకుంటామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సమావేశంలో పాలవలస యశస్వి… సూర్యనారాయణ… తదితరులు పాల్గొన్నారు.