వనపర్తి, నాగరకర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపెట్, ఉమ్మడి మహబూబ్ నగర్, జిల్లాలోని సైనికులందరు కలసి అమర వీరుల త్యాగాలకు గుర్తుగా నూతన సంవత్సర క్యాలెండర్ 2021 రూపొందించారు.
సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు భారత సైనిక అమర వీరుల క్యాలెండరును ఆవిష్కరించారు.
దేశ రక్షణలో అసువులు బాసిన అమర జవాన్ లకు ఈ సందర్భంగా ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశంలో గౌరవప్రదమైన సేవ సైనికులదని ఆమె అన్నారు.
దేశ సరిహద్దులను కాపాడటం కోసం సైనికులు ప్రాణాలను సైతం అర్పిస్తున్నారని ఆమె అన్నారు. దేశాన్ని, దేశ ప్రజలని అహర్నిశలు కాపాడుతూ దేశరక్షణకై తమ కుటుంబాలకు దూరంగా ఉండే మహనీయులు సైనికులని ఆమె అన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన షహిద్ వీర్ జవాన్ ల సేవలను త్యాగాలకు గుర్తుగా నూతన సంవత్సరం 2021 క్యాలెండర్ ను తీసుకురావడం అభినందనీయమని అన్నారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ నరేష్, హావల్ దార్ సాయికుమార్, L/NK నరసింహ, సిపాయి ప్రవీణ్ కుమార్, సిపాయి L/NK N రాజుకుమార్ లు పాల్గొన్నారు.
వీళ్ళందరు ఆర్మీలో పనిచేస్తూ సెలవులో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి