ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) కన్నుమూశారు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో వున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. యువచిత్ర ఆర్ట్స్ పేరుతో పలు సినిమాలు నిర్మించిన కాట్రగడ్డ సీతామహాలక్ష్మి, గోరింటాకు , త్రిశూలం, సీతా రామ కళ్యాణం, జానకిర్రాముడు, శ్రీనివాస కల్యాణం, సహా పలు చిత్రాల నిర్మించారు. సంగీత ప్రాధాన్యం కల చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. కాగా మురారి అన్ని చిత్రాలకు కేవీ మహదేవన్ సంగీత దర్శకుడు కావడం విశేషం. అంతేకాకుండా ఆయన రచించిన “నవ్వి పోధురు కాక ” అనే పుస్తకం ప్రాచుర్యం సంపాదించింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
previous post
next post