సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జన సమితి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న MLC ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ని గెలిపించాలని, మొదటి ఓటే ధ్యేయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
హుజూర్ నగర్ పట్టణ తెలంగాణ జన సమితి కన్వీనర్ గా తూడిమళ్ళ మోహన్ రావు,కో-కన్వినర్ గా సోము శ్రీనివాసరెడ్డిని, నియమించారు.మేళ్ళచెరువు మండల పార్టీ బాధ్యతలను సోము శ్రీనివాస రెడ్డి అప్పగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కార్యదర్శి భిక్షం, నగేష్, కొండలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.