బాగ్ అంబర్పేట్ డివిజన్లోని ఎస్బిహెచ్ కాలనీపార్కులో అసోసియేషన్ సభ్యులతో కార్పొరేటర్ బి.పద్మ వెంకటరెడ్డి నేడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో వాటర్ లో ప్రెషర్, బీటీ రోడ్డుప్యాచ్ వర్క్, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్ కావాలని, వీధి దీపాలకు అడ్డంగా ఉన్న చెట్లు కొమ్మలు తొలగింప చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.
వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో బిజెపి జోగులాంబ జిల్లా ఇన్చార్జి బి.వెంకట రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, గోవర్ధన్ రెడ్డి, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టి బాలరాజు, దండు భాస్కర్, గుగ్గిళ్ళ శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట