రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా, కీసర మండలం, ధమ్మాయిగూడ చౌరస్తాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిష్టిబొమ్మను దహనం చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ నియంత పరిపాలన కొనసాగిస్తూ తనను ప్రశ్నించిన వారి పై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజాక్షేత్రంలో ఇలాంటి దుష్ట కాండను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఐక్యతతో పోరాడి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతుందని ఆయన హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ ధమ్మాయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు సురకంటి శ్రీకాంత్ రెడ్డి, కౌన్సెలోర్లు గోగుల సరిత, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ నవనీత, రామారావు మాజీ సర్పంచ్ నాగ రంజిని, సంజీవరెడ్డి, కందాడి శ్రవణ్ రెడ్డీ, రాజు, ఓజల్, శ్రీనివాస్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.