29.7 C
Hyderabad
May 4, 2024 04: 21 AM
Slider హైదరాబాద్

ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి

#medchal

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి  కేటీఆర్ పిలుపు మేరకు  మల్లాపూర్ డివిజన్ తెరాస శ్రేణులు  శివ హోటల్ చౌరస్తాలో నల్లజెండాలు, కండువాలు ధరించి కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ, పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోడీ తెలంగాణపై అక్కసును వెళ్లగక్కుతూ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను అవహేళన చేస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచిన మోడీ క్షమాపణ చెప్పాలి అని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి , అనుబంధ సంస్థల ఆధ్యక్ష కార్యదర్శులు , మహిళా నాయకురాళ్లు , పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్

Related posts

తెలంగాణ లో బెడిసికొడుతున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు

Satyam NEWS

ప్రవీణ్ కుమార్ జోలికొస్తే సహించం

Bhavani

పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

Satyam NEWS

Leave a Comment