టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి మెళ్ళచేరువు,చింతలపాలెం మండల కేద్రాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. స్థానిక తెరాస పార్టీ శ్రేణులు గురువారం మోడీ హటావో దేశ్ బచావో అంటూ నినదిస్తూ హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు.
తెలంగాణ రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలంటూ తెలంగాణ శ్రేణులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గరిడేపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన తెలుపుతూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నేరేడుచర్ల పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద మోదీ దిష్టిబొమ్మకు దహన కార్యక్రమాలు నిర్వహించారు. పాలకీడు మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి ప్రధాన కూడలి వద్ద దహన కార్యక్రమాలు నిర్వహించారు.
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో క్రొత్త బస్టాండ్ నుండి ఇందిరా చౌక్ వరకు తెరాస శ్రేణులు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ఇందిరా చౌక్ వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
బాచిమంచి చంద్రశేఖర శర్మ, సత్యం న్యూస్, హుజూర్ నగర్