తమ నాయకుడు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జోలికొస్తే సహించేది లేదని బీఎస్సీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జ్ అయితగాని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గువ్వల బాలరాజు అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తమ నాయకుడు ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ, రాజ్యాంగం ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్యేగా ఎన్నికై పదవిని అనుభవిస్తున్న గువ్వల బాలరాజు,
రాజ్యాంగమే మేనిఫెస్టోగా పనిచేస్తున్న బీఎస్పీ పార్టీని, బీఎస్పీ చీఫ్ డా॥ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ని విమర్శించడం హేయమైన చర్య అన్నారు. ఆదిపత్య కుల పార్టీలలో ఉన్న బహుజన ప్రజాప్రతినిధులు కేవలం సమాజంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న బహుజన నాయకులను విమర్శించడమే వారి కర్తవ్యంగా చేసుకోకూడదని సూచించారు.