2014 లో మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుందని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్సి తాతా మధు పేర్కొనారు. పెరుగుతున్న సిలిండర్ ధరలపైన ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి… పెరుగుతున్న సిలిండర్ ధరలు, నిత్యవసర సరుకుల పెరుగుదల వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రజల కష్టాలు, కడగండ్ల పాలు చేస్తున్న మోడీ పాలన పై, బీజేపీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ మార్చి 3 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలని బిఆర్ఎస్ జిల్లా శ్రేణులకు మధు విజ్ఞప్తి చేశారు.
previous post