మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన కోసం ప్రయత్నం చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కి 10 డివిజన్ల కోఆర్డినేటర్లు నేడు వినతి పత్రం సమర్పించారు. మున్నూరు కాపు రాష్ట్ర కన్వీనర్ పుటం పురుషోత్తం రావు పటేల్ ఆదేశానుసారం ఉప్పల్ నియోజకవర్గం కన్వీనర్ గంధం నాగేశ్వర్ రావు పటేల్ అధ్వర్యంలో నేడు హబ్సిగూడాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గంధం నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేషన్ సాధన కోసం పోరాటం చేస్తామని, మున్నూరు కాపుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ కోఆర్డినేటర్ గాదె సత్యనారాయణ పటేల్, కాప్రా -రెడ్డి శ్రీనివాస్ పటేల్,ఎ ఎస్ రావు నగర్ -లక్ష్మినారాయణ పటేల్,చర్లపల్లి -వేల్పుల శ్రీనివాస్ పటేల్, హెచబీకాలనీ -సత్తన్న పటేల్, మల్లాపూర్ -భాస్కర్ పటేల్, నాచారం -తిప్పిరి రాజబాబు పటేల్, చిలకానగర్ -నవీన్ పటేల్, హబ్సిగూడ -వెంకన్న పటేల్, ఉప్పల్ -మురళి పటేల్ మరియు మామిడ్ల శ్రీనివాస్ పటేల్ , జగదీష్ పటేల్ , పలుగుల అంజయ్య పటేల్త,దితరులు పాల్గొన్నారు.