38.2 C
Hyderabad
April 29, 2024 21: 58 PM
Slider వరంగల్

టిఆర్ఎస్ ని ఎదుర్కొనే దమ్ము ఒక్క బీజేపీ కి మాత్రమే వుంది

#BJPMulugu

టీఆర్ఎస్ పార్టీ యువతను మోసం చేసిందని ,లక్ష ఉద్యోగాల పేరుతో యువతను భ్రమలో పడేసిందని భారతీయ జనతా పార్టీ ములుగు మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్ అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ములుగు డిగ్రీ కాలేజీలో ఉపాధ్యాయులను నేడు ఆయన కలిశారు. వరంగల్ ఖమ్మం నల్గొండ బీజేపీ పట్టభద్రుల MLC ఎన్నికల అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి ని గెలిపించాలని ఆయన కోరారు.

అబ్బాపూర్ , శ్రీరాముల పల్లి, జాకారం  గ్రామాల్లో కూడా బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. ప్రైవేటు టీచర్లను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఫాంహౌస్ పాలన అంతం కోసం ప్రశ్నించే గోంతు కోసం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి గెలిపించాలని ఇమ్మడి రాకేష్ యాదవ్ కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భూక్య రాజు నాయక్, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నగరపు రమేష్ BJYM జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు అడప బిక్షపతి, బిజెపి ములుగు మండల ప్రధాన కార్యదర్శి కోగిల కవిరాజు,

బీజేపీ ములుగు మండల ఉపాధ్యక్షుడు నల్లల్లా జితేంద్ర, బీజేవైఎం జిల్లా నాయకులు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సానికొమ్ము హరీష్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు పొలబోయిన సురేందర్, బొజ్జ సిద్ధార్థ, బానోతు దేవీసింగ్ లక్కమ్ శంకర్, కోట అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు మరిన్ని వసతులు

Bhavani

మొన్న శ్రీలంక, నేడు పాకిస్థాన్!

Satyam NEWS

ప్రతి ఒక్కరూ ఓటర్ గా పేరు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment