కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాల ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న PRTU తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్(40) నేడు కరీంనగర్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. శ్రీనివాస్ తన భార్య కలిసి కారులో ఈరోజు ఉదయం కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారు.
అలుగునూర్ మానేర్ వంతెన వద్ద కు రాగానే కారు అదుపు తప్పి బ్రిడ్జి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న ఒక కానిస్టేబుల్ ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలిసిందే. ఒక మంచి మిత్రుడిని, ఉత్తమ ఉపాధ్యాయుడిని కోల్పోవడం తమకు బాధ కలిగిస్తున్నదని PRTU తెలంగాణ, కరీంనగర్ జిల్లా శాఖ తెలిపింది.
గండి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, బాధ తప్త హృదయం తో నివాళి అర్పించారు. శ్రీనివాస్ భార్యకు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయని ఆమె త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు PRTU నాయకులు తెలిపారు.