వ్యవసాయ మార్కెట్ యార్డ్ లలో వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు మార్కెట్ కమిటీ కార్యదర్శులను ఆదేశించారు.
మంగళవారం ఆయన చాంబర్ లో మార్కెట్ కమిటీ కార్యదర్శులతో రబీ ధాన్యం కొనుగోలు పై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ యార్డులలో ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.
మార్కెట్ యార్డ్ లలో సందర్భంగా టార్పాలిన్లు ,తేమ కొలుచు యంత్రాలు, తూకం వేసే యంత్రాలు, గన్ని బస్తాలు తగినన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.