33.7 C
Hyderabad
April 29, 2024 01: 22 AM
Slider ఆదిలాబాద్

మార్కెట్ యార్డ్ లలో రైతులకు వసతులు కల్పించాలి

#ABhaskarrao

వ్యవసాయ మార్కెట్ యార్డ్ లలో వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు మార్కెట్ కమిటీ కార్యదర్శులను ఆదేశించారు.

మంగళవారం ఆయన చాంబర్ లో మార్కెట్ కమిటీ కార్యదర్శులతో రబీ ధాన్యం కొనుగోలు  పై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ యార్డులలో ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.

మార్కెట్ యార్డ్ లలో  సందర్భంగా  టార్పాలిన్లు ,తేమ కొలుచు యంత్రాలు, తూకం వేసే యంత్రాలు, గన్ని బస్తాలు తగినన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం

Satyam NEWS

న్యాయమూర్తులను తిడుతున్న పాక్ రాజకీయనేతలు

Satyam NEWS

తెలంగాణ విమోచన దినోత్సవం రోజున రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి రాక…!

Satyam NEWS

Leave a Comment