ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు DMHO అప్పయ్యతో కలిసి ఆయన పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ భాగస్వాములై పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. ఐదు సంవత్సరాల పిల్లలకు అందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని పిల్లలు పోలియో బారిన పడకుండా కాపాడాలని జెడ్ పి చైర్మన్ పిలుపునిచ్చారు.
ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ములుగు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య, ములుగు జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కోరిక విజయ్ రామ్ నాయక్, స్థానిక ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, రమేష్ రెడ్డి, తాహెర్ పాషా తదితరులు ఉన్నారు.