పౌరుల జీవన విధానంలో స్వచ్ఛత ఒక మౌళిక సూత్రంగా మారాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్బిఐ జూబ్లీపురలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి కార్యక్రమాన్ని కల్లూరు యూబీఐ, పాండురంగాపురం ఎపిజీవిబి, వైరా రోడ్ ఐఓబీ బ్యాంకు బ్రాంచులు, డిసిసిబి ప్రధాన కార్యాలయంలోను చేపట్టి లోపల, బయట శుభ్రం చేసి, చెత్తా చెదారం తొలగించినట్లు ఎల్డిఎం తెలిపారు.
నగరాలు చెత్తాచెదారం లేనివిగా, సంపూర్ణ స్వచ్ఛత సాకారం అయ్యేలా ప్రతిజ్ఞ చేయాలని ఎల్డిఎం పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ బ్రాంచుల మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నార