రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీతో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థకు 6 లక్షల కోట్ల రూపాయల (80 బిలియన్ డాలర్లు) బూస్టర్ డోస్ లభించనుంది. ఈ దేశాలు 2025 నాటికి టూ-వే పెట్టుబడిని 50 బిలియన్ల డాలర్లకు చేర్చాలని కోరుకుంటున్నాయి. అలాగే 30 బిలియన్ల డాలర్లకు మించి వ్యాపారం చేయాలని భావిస్తున్నాయి.
పుతిన్ పర్యటనలో 28 ఒప్పందాలు కుదిరాయి. రష్యా తన రక్షణ అవసరాలను తీర్చడంలో భారతదేశానికి చాలా కాలంగా అతిపెద్ద మిత్రదేశంగా ఉంది. రక్షణతో పాటు పెట్రోలియం, ఫార్మా, అణుశక్తి వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఉంది. భారత్-రష్యా స్నేహం బలపడింది. ఇక 2020-21 గురించి చూసినట్టయితే, రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 8.1 బిలియన్ డాలర్లు.
ఈ కాలంలో భారత ఎగుమతులు 2.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, రష్యా నుంచి దిగుమతులు 5.48 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారతదేశంతో రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 9.31 బిలియన్ డాలర్లు. ఇందులో భారత ఎగుమతులు 3.48 బిలియన్ డాలర్లు కాగా దిగుమతులు 5.83 బిలియన్ డాలర్లు.