31.2 C
Hyderabad
May 3, 2024 00: 45 AM
Slider మహబూబ్ నగర్

అభివృద్ధి చెందిన అమెరికాలో జాతివివక్ష దాడులా?

#Mule Keshavulu

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ చావుకు కారణమైన శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి డెరిక్ కు వెంటనే మరణశిక్ష విధించాలని మాల చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలె కేశవులు డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అధిక ధనిక దేశంగా ఉన్న అమెరికాలో నల్ల జాతి తెల్ల జాతి అనే వివక్షత కొనసాగడం దారుణమని ఆయన అన్నారు.

నల్లజాతీయులను ఏదో ఒక కారణంతో చంపుతున్నారని, నల్ల జాతి వివక్షత తో క్రూరంగా దాడి చేసి జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైనా శ్వేత జాతీయుడు డెరిక్ ను వెంటనే ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికాలో చేస్తున్న నిరసన ఆందోళన సామాజిక ఉద్యమానికి మాలల చైతన్య సమితి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు.

ఈ ఉద్యమంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దాకా అమెరికాలో నల్ల జాతీయులకు ప్రాణ రక్షణ కల్పించాలని పోరాడే ఉద్యమానికి ఉద్యమ వందనాలని ఆయన తెలిపారు.

Related posts

వర్షాకాలం సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండండి

Satyam NEWS

సిబిఐటి విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

Satyam NEWS

పోలీసులు పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment