రాజస్థాన్ రాష్ట్రంలో మత ఉగ్రవాదుల దాడిలో కన్హయ్య లాల్ దారుణ హత్యకు గురికావడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి అని సాధారణ ప్రజల్లో కూడా అభద్రతా భావం నెలకొంది అని కడప హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు
ఇటువంటి సమయంలో చట్టం ప్రకారం శాంతియుత మరియు సామరస్యపూర్వక వాతావరణాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం అని గత మూడున్నరేళ్లలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఈ ఉగ్రవాద దాడికి పూర్తిగా బాధ్యత వహించాలి అని ఇది స్వతహాగా జరిగిన సంఘటన కాదని కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి
కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి ఉగ్రవాద సంస్థలు విజృంభిస్తున్నాయి అని హిందుఐక్య వేదిక నాయకులు ఈ ఘటనను ఊచకోతగా అభివర్ణించారు. ఎవరైనా హత్యను వీడియో తీసి వైరల్ చేస్తే అది మామూలు వివాదం కాదు. ఇది హత్య కాదు, బహిరంగ ఉగ్రవాద దాడి హిందు ఐక్యవేదిక నాయకులు అన్నారు.