38.2 C
Hyderabad
May 2, 2024 21: 51 PM
Slider కడప

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న రజనీకాంత్

#Rajinikanth

కడపలోని అమీన్ పీర్ దర్గాను సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. రజనీకాంత్ తో పాటు ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్, సంగీత మంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ కూడా దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. అక్కడి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఇక దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. రజనీ రాకతో ఆయన అభిమానులు భారీగా దర్గా వద్దకు చేరుకుంటున్నారు. 

ఉదయం రజనీకాంత్ ఆయన కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత అక్కడి నుంచి రజనీకాంత్ నేరుగా కడప జిల్లాకు చేరుకున్నారు.

Related posts

ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మహత్య

Satyam NEWS

స్థానిక ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాలి హైకోర్టు

Sub Editor

మత్స్యకారుల అభివృద్ధి కోసమే చేప పిల్లల పంపిణీ.. మంత్రి పువ్వాడ

Sub Editor

Leave a Comment