రక్షాబంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, లక్ష్మీబాయి లు రాఖీలు కట్టారు. సోమవారం ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి లక్ష్మీబాయి రాఖీ కట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి శోభ కూడా వున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి మనుమడు, మంత్రి కె.టి.ఆర్ కుమారుడు హిమాన్షుకు అతని చెల్లెలు అలేఖ్య రాఖీ కట్టారు.