కామారెడ్డి జిల్లా జుక్కల్ శాసన సభ్యులు, ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండేకు బిచ్కుంద జడ్పిటిసి సభ్యురాలు భారతి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతిరూపమైన రాఖీ పౌర్ణమి పండుగ ఉత్సవాలు మండల కేంద్రంతో పాటు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నల్సర్ రాజు, తెరాస సీనియర్ నాయకులు మహిపతి హనుమాన్లు ఉన్నారు.