స్పోర్ట్స్ ఈవెంట్స్ ద్వారా యువతి, యువకులలో చైతన్య కలుగుతుందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి & బిజెపి వెంగళరావు నగర్ డివిజన్ ఇంచార్జ్ ఏడెల్లి అజయ్ కుమార్ అన్నారు. అంబర్పేట ఎంసిహెచ్ గ్రౌండ్స్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆయన క్రికెట్ కిట్లు, టి- షర్ట్లు అందచేశారు. ఆటల పోటీల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందడమే కాక, మెంటల్ స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఆటల పోటీలను ఇంకా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట కురుమ సంఘం ప్రధాన ఎం లింగం కురుమ, నాయకులు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సీ.కృష్ణ గౌడ్, మధు యాదవ్, ఏ.రమేష్, కృష్ణంరాజు, ఎం.శ్రీనివాస్, ధర్మేందర్, లక్ష్మణ్, ఆర్.వి.ఎల్ రమేష్, ఏడెల్లి శ్యామ్, ఏడెల్లి రామ్, ఏడెల్లి బాలు, మస్కా మహేష్ కుమార్, j.అనిల్ కుమార్, బి. సాయి చరణ్, ఉదయ్ కుమార్, ఈ.అజయ్ కుమార్, రామ్ రెడ్డి, ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
previous post