Slider హైదరాబాద్

ఆగం అయితే భ‌విష్య‌త్తు ఆగం!

TRS Khu

127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ లో జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, బిజెపి పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇంతటి సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయా? అని అడిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉండే ప్రభుత్వమని, తమ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా ప్రజల మంచికే అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని, కనీవినీ ఎరుగని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం అతి స్వల్ప కాలంలో చేసిందని అన్నారు.

డిసెంబర్ 1న జీహెచ్ఎంసి ఎన్నికలు వస్తున్నసందర్భంగా ప్రజలందరూ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన బి.విజయ్ శేఖర్ గౌడ్‌కు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఓటు వేసేటప్పుడు ఆగం అయితే భవిష్యత్తు ఆగం అవుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మోడీని ఢీ కొట్టేందుకు మమతమ్మ రెడీ

Satyam NEWS

ఇంటింటా జ్వర సర్వే: లక్షణాలు ఉన్నవారికి ఐసోలాషన్ కిట్ల అందచేత

Satyam NEWS

నాగ‌ర్ క‌ర్నూల్‌లో 8న ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

Sub Editor

Leave a Comment