శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
మతకలహాలు లేకుండా అన్ని మతాలవారూ కలిసి మెలిసి ఉండే విధంగా టీఆర్ఎస్ పాలన ఉందని, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం హైదరాబాద్ ప్రజలకు ఉందని ఆయన అన్నారు.
మిర్యాలగూడా ఎమ్మెల్యే భాస్కరరావు, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్ధి దీపుతో కలిసి నేడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ కు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.