నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమన్వయకర్తగా రంగినేని అభిలాష్ రావు ను నియమిస్తూ టీపీసీసీ అద్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత వేగవంతం పెంచేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేస్తూ రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రంగినేని అభిలాష్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రేవంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షులు డా.మల్లు రవి, మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ చిన్నారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ, వనపర్తి జిల్లా అధ్యక్షులు తైలం శంకర్ ప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
previous post