అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియంపేట గ్రామస్తులు ఒక ఆటోలో అనంతపురానికి వస్తుండగా అనంతపురం బెంగళూరు హైవే లోని డి మార్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
వేగంగా వెళుతున్న లారీ ఆటో ను బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు విడిచారు. మరో ఐదు మంది తీవ్రంగా గాయపడటంతో వారిని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన లారీ ఆచూకీ తెలియడం లేదు.