28.7 C
Hyderabad
April 28, 2024 06: 26 AM
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీకి మూడు సీట్లు?

#chandrababu

తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా  ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ కి మూడు సీట్లు ఇవ్వనన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోసియాల్ మీడియాలో, జనసేన గ్రూపులలో ఒక మెస్సేజ్ చక్కర్లు కొడుతోంది. ఒక SC  రిజర్వుడ్, రెండు జనరల్ స్థానాలను కేటాయించనున్నట్లు సమాచారం. జిల్లాలో  భారీగానే  జనసేన ఆశలు పెట్టుకుంది. చిత్తూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో జిల్లాలో ఉన్న 14 స్థానాలకు గాను, ఐదు స్థానాలను జనసేన పార్టీ ఆశించింది.

జిల్లాలో ఇప్పటికే జనసేన అభ్యర్థులు ఎన్నికల రణరంగంలోకి దూకారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ కార్యరంగంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటివరకు జనసేన అభ్యర్థులు ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. అయితే టిరుపతి నుండి పవన్ కళ్యాణ్, మదనపల్లి నుంచి గంగారపు రామదాసు చౌదరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పొన్న యుగంధర్ పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.

తిరుపతి నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో NTR,  ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్కడ బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా, అక్కడ బలిజ కులస్తులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. గత ఎన్నికల్లో తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగుణమ్మ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా ఆమె పోటీకి సమాయత్తమయ్యారు. తిరుపతి నుండి పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గానీ పోటీ చేస్తే తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించే అవకాశం ఉంది.

ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ తిరుపతి టికెట్ కోసం పోటీలో ఉన్నారు. అయితే స్థానిక అభ్యర్థులకు టికెట్లు ఇస్తే సహకరించేది లేదని తెలుగుదేశం పార్టీ  అభ్యర్థులుగా రంగంలో ఉన్న నాయకులు అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుండి పోటీ చేయాలని తెలంగాణా ఎన్నికల తరువాత భావిస్తున్నట్లు సమాచారం. కావున పాలకొల్లు, ఇచ్చాపురం, తిరుపతిలో రెండు స్థానాల నుండి పవన్ పోటీ చేసే అవకాశం ఉంది.

మదనపల్లి నియోజకవర్గం నుంచి ఈ పర్యాయం గంగారపు రాందాస్ చౌదరి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. జనసేన తెలుగుదేశం పొత్తు ఖరారు అయినా నాటి నుంచి తెలుగుదేశం పార్టీతో కలిపి గంగారపు రాందాస్ చౌదరి చురుగ్గా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అంతకుముందు కూడా జనసేన కార్యక్రమాలు మదనపల్లిలో  చాలా సురుగ్గా జరిగాయి. గంగారపు రాందాస్ చౌదరి 2004 ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సుమారు 48 వేల ఓట్లు సాధించారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే  అవకాశం రాలేదు గత ఎన్నికల్లో రాందాస్ చౌదరి సతీమణి గంగారపు స్వాతి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ పర్యాయం తిరిగి పోటీ చేయడానికి రాందాస్ చౌదరి సిద్ధమవుతున్నారు.

రిజర్వుడు నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్న యుగంధర్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. మండల పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభిస్తున్నారు. మొదటినుంచి గంగాధర నెల్లూరులో జనసేన కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత తెలుగుదేశాన్ని కలుపుకొని ఉదృతంగా పొన్న యుగంధర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పొన్నా యుగంధర్ కు ఇటేవల ప్రమాదం జరిగింది. తిరుపతిలో చికిత్స అనంతరం మూడు చక్రాల బండిలో కూర్చునే యుగంధర్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ రిపోర్టర్, చిత్తూరు జిల్లా

Related posts

ఓయూ వద్ద యువతిపై ప్రేమికుడు కత్తితో దాడి

Satyam NEWS

ఈ నెల‌ 14 న మహాధర్నాకు కదలిరండి: ఏఐటీయూసీ

Satyam NEWS

మునుగోడు నామినేషన్ వివాదం : గ్రామ బహిష్కరణ అబద్ధం

Satyam NEWS

Leave a Comment