ఏలూరు జిల్లా పెదవేగి కూచింపూడి లో గాంధీ బొమ్మల సెంటర్ నుండి శుద్ధరాళ్ల మెట్ట వరకు గల ఆర్ అండ్ బి ప్రధాన రహదారి గోతులుగా మారింది. కొన్నాళ్ళుగా ప్రయాణికులు ఆ రహదారిలో నరకం చూస్తున్నారు. గ్రామస్తులు పడుతున్న యాతన తెలుసుకున్న దెందులూరు ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి ఆ రహదారి తాత్కాలిక మరమ్మతు లు నిర్వహించాలని గ్రామ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎం ఎల్ ఏ ఆదేశాలతో గ్రామ సర్పంచ్ సొంగా ప్రవీణ్, గ్రామ పెద్దలు వై సి పి నాయకులు గంగిరెడ్ల కృష్ణఅంజనేయులు, సొంగా పోతురాజు తదితరులు జె సి బి తో రహదారి తాత్కాలిక అభివృద్ధికి చర్యలు చేపట్టారు.
రహదారిలో ఉన్న పెద్ద పెద్ద నీటి గుంటలను పూడ్చి వేశారు. వర్షం పడినా నీరు నిల్వకుండా ఉండేందుకు గ్రావెల్ తో రహదారిని మేరకు చేయనున్నారు. ఎం ఎల్ ఏ.చొరవ పెద్దల కృషి తో రహదారికి మోక్షం కలిగిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.