ఫిలిం మేకర్ అనురాగ్ కాశ్యప్ పై అత్యాచార యత్నం ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్ తనను కూడా ఆ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించిందని తెలుపుతూ పరువునష్టం దావా దాఖలు చేసిన నటి రీచా చద్దా కు సంబంధించిన వార్తలు ప్రసారం చేయవద్దని, ప్రచురించవద్దని బొంబయి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రీచా చద్దాకు సంబంధించి తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉప సంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పేందుకు పాయల్ ఘోష్ సంసిద్ధత వ్యక్తం చేసినందున తదుపరి ప్రక్రియ చేపట్టాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పాయల్ ఘోష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కమల్ ఆర్ ఖాన్ లపై కోటి రూపాయలకు రీచా చద్దా పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వాదనలు విన్న బొంబయి హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
పాయల్ ఘోష్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవడమే కాకుండా క్షమాపణ చెప్పేందుకు సిద్ధ పడ్డందున ఏ విధంగా క్షమాపణ ఉండాలనే అంశాన్ని నిర్ణయించాలని కోర్టు ఆదేశించింది. రీచా చద్దా పరువునకు భంగం కలిగించే వార్తలను ప్రసార సాధనాలు నిలుపుదల చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.