తాడ్వాయి మండలంలోని మేడారంలోని జంపన్నవాగులో పల్లపు తరుణ్(14) అనే బాలుడు ప్రమాదవశాత్తు పడి బుధవారం సాయంత్రం మరణించాడు.
మేడారం గ్రామానికి చెందిన మహేందర్-యాద లక్ష్మి లకు ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. వీరి లో పెద్ద కుమారుడైన తరుణ్ బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల గల కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కొంగల మడుగు వద్ద లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ఉన్నట్టుండి వరద ప్రవాహం పెరిగింది.
ఈత రాకపోవడంతో తరుణ్ వాగు ప్రవాహనికి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున సంఘటన వద్దకు చేరుకొని బాలుడు ఆచూకీ కోసం వెతకగా వరద ఎక్కువగా ఉండడంతో తరుణ్ ఆచూకీ లభ్యం కాలేదు.
ఒక్కగానొక్క కొడుకు జంపన్న వాగు లో గల్లంతు కావడం తో తల్లిదండ్రులు, బంధువులు, మేడారం, రెడ్డి గూడెం గ్రామాల ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు హుటాహుటిన సి ఆర్ పి ఎఫ్ సివిల్ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.