29.7 C
Hyderabad
May 2, 2024 04: 08 AM
Slider నిజామాబాద్

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

Redgarm

బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రంను జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం 5800 రూపాయల మద్దతు ధర ప్రకటించిందని, రైతులు దళారులను ఆశ్రయించ రాదని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సంధి సాయవ్వ సాయిరామ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, పట్టణ అధ్యక్షులు బొమ్మల లక్ష్మణ్,  సొసైటీ చైర్మన్ దర్పల్లి గంగాధర్, సొసైటీ కార్యదర్శి శ్రావణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, పార్టీ సీనియర్ నాయకులు పాషా సెట్  గ్రామాల్లో ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

Related posts

కోరుట్ల పట్టణంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన

Satyam NEWS

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సేవలో గవర్నర్

Satyam NEWS

మహానుభావుల త్యాగ ఫలితం వల్ల ఏర్పడ్డ స్వాతంత్ర దినోత్సవం

Satyam NEWS

Leave a Comment