40.2 C
Hyderabad
April 26, 2024 12: 15 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇన్విటేషన్: సిఎం జగన్ ను కలిసిన సిఎం రమేష్

cm ramesh

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. నేడు ఉదయం అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సీఎం రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు శుభలేఖ అందించారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అక్కడ ఉన్నారు. ఇటీవలే రిత్విక్ నిశ్చితార్థం ప్రముఖ ఇండస్ట్రియలిస్టు తాళ్లూరి రాజా కుమార్తె పూజతో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం భారత్ నుంచి అతిథులు వెళ్లేందుకు సీఎం రమేశ్ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేశారు.

Related posts

Atrocious: యువతి కిడ్నాప్: సామూహిక అత్యాచారం: దారుణ హింస

Satyam NEWS

ఆర్ఎస్ఎస్ అనుబంధ సేవాభార‌తి కార్యాల‌యం ప్రారంభం

Satyam NEWS

కొత్తవలసకు వస్తున్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్

Satyam NEWS

Leave a Comment