తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడిలో పాల్గొనేందుకు బయలుదేరిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
దేశంలో కరోనా విలయ తాండవ సమయంలో సామాన్య ప్రజల నడ్డి విరిచె విధంగా పెట్రోల్,డీజిల్,నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడి పిలుపునిచ్చింది.
సామాన్య,మధ్య తరగతి ప్రజలకు బాసటగా నిరసన తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టగా కాంగ్రెస్ నేతలు తన్నీరు మల్లికార్జున రావు, పిసిసి జాయింట్ సెక్రటరీ ఎం.డి.అజీజ్ పాషా, జక్కుల మల్లయ్య,సైదా మేస్త్రి, కృష్ణ ను శాంతి భద్రతల ముందస్తు జాగ్రత్త చర్యగా పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.