31.2 C
Hyderabad
May 3, 2024 02: 13 AM
Slider ఆదిలాబాద్

రిటైర్ అయిన పోలీసుకు ఆత్మీయ వీడ్కోలు

#NirmalSPSeshidharRaju

రిటైర్ మెంట్ కేవలం వృత్తికే కాని వ్యక్తిత్వానికి కాదని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. జిల్లా పోలీసు విభాగంలో విశిష్ట సేవలనందించిన నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. డి.నర్సయ్య, హెడ్ కానిస్టేబుల్ టి.హీరాసింగ్ లు నేడు రిటైర్ అయ్యారు.

ఆ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అసోసియేషన్ అధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది. ఈ సభలో ఎస్పీ శశిధర్ రాజు వారిని శాలువలతో సన్మానించి జ్ఞాపికలను అందచేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు చేసిన సేవలను కొనియాడారు.

విధి నిర్వహణలో పగలనక, రాత్రనక,  పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేశారని అన్నారు. ఎన్నో ఇబ్బందులకు గురి అయినా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. పదవి విరమణ చేసిన పోలీసులు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా గడుపుతూ సమజానికి సేవలు చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమము లో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరసత్ అలీ, దేవిదాస్, మురాద్ అలీ, ప్రకాష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

3న జరిగే చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

Satyam NEWS

నరసరావుపేట ప్రశాంతతను భగ్నం చేయద్దు లోకేష్

Satyam NEWS

యువత ఆలోచనలకు అద్దం గుజరాత్ ఫలితాలు

Satyam NEWS

Leave a Comment