సీనియర్ల పేరుతో కొందరు కాంగ్రెస్ నేతలు కలిసి రాకపోయినా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తన కార్యక్రమాలను ఆపడంలేదు. రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు టీపీసీసీ పోస్టర్ విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా తాను పాదయాత్ర చేయనున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
రూట్ మ్యాప్ వర్కవుట్ నడుస్తుందన్నారు. నిరంతరాయంగా పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. గాంధీభవన్లో టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి షబ్బీర్ అలీ, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రేవంత్కు వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్లు సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయించుకున్నారు. ఈ భేటీకి సీనియర్లు హజరవ్వకుండా నిరసన వ్యక్త చేశారు. రేవంత్తో తాడోపేడో తేల్చేందుకు సిద్ధమయ్యారు.